AP: టీటీడీ మాజీ విజిలెన్స్ ఏవీఎస్వో సతీశ్ కుమార్ను సాక్ష్యాలను తారుమారు చేసేందుకే వైసీపీ నాయకులు హత్య చేశారని యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్ ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వివేకా హత్య కేసులో సాక్షులను ఎలా హతమార్చారో, ఇప్పుడు పరకామణి కేసులోనూ ఒక్కొక్కరిని హతమారుస్తున్నారని అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ అన్ని నేరాలకు కేరాఫ్ అడ్రస్ అని, పరకామణి ఉదంతంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.