వెండి చంద్రుడు, శుక్రుడితో సంబంధం కలిగి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తోంది. వెండి ధరించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరుగుతుంది. సంపద, శ్రేయస్సు, ఐశ్వర్యాన్ని అందించి, లక్ష్మీదేవి ఆశీర్వాదాలను కలిగిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, వెండి పిత్త రుగ్మతలను సమతుల్యం చేసి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. కర్కాటక, వృశ్చిక, మీన రాశుల వారికి వెండి ధరించడం శుభప్రదం. పురుషులు కుడి చేతికి, స్త్రీలు ఎడమ చేతికి ధరించాలి. వెండిని పచ్చి ఆవు పాలలో శుద్ధి చేసి, 'ఓం సోమాయ నమ:' మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ ధరించాలి.