వాట్సప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్లకు సంబంధించిన సిమ్ బైండింగ్ నిబంధనల అమలు గడువును డిసెంబర్ వరకు పొడిగించాలని కేంద్రం యోచిస్తోంది. టెక్ కంపెనీల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సిమ్ బైండింగ్ అంటే సిమ్ కార్డు లేకుండా యాప్లు పనిచేయవు. గత ఏడాది నవంబర్లో ఈ నిబంధనలు తీసుకురాగా, అమలుకు 90 రోజుల గడువు విధించారు. అయితే, సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు యాప్లు కేంద్రానికి తెలిపాయి. ఈ సవాళ్లను అధిగమించడానికి మరికొంత సమయం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.