AP: సాయికృష్ణ తల్లి విజయవాడ కోర్టులో వేసిన పిటిషన్పై సిట్ కౌంటర్ దాఖలు చేసింది. సాయికృష్ణ మృతిపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలు చేయగా, కలెక్టర్ మెజిస్టీరియల్ విచారణ ఆదేశాల దృష్ట్యా న్యాయ విచారణ అక్కర్లేదని కోర్టు పేర్కొంది. నాగరాజును సిట్ అధికారులు విచారించేందుకు రాజమహేంద్రవరం జైలు అధికారులు ఏర్పాట్లు చేశారు. విజయవాడలో విచారణకు అనుమతించాలని హైకోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది.