TG: మేడారం జాతరలో సమ్మక్క తల్లి ఆగమనం అనంతరం లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఒక్కసారిగా పెరిగిన రద్దీతో జంపన్నవాగు మార్గం కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో మార్గమధ్యంలోని పలు దుకాణాల్లో లూటీలు జరిగినట్లు సమాచారం. భక్తుల రద్దీతో భద్రతా చర్యలు సవాల్గా మారగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.