టెన్త్ పరీక్ష రాస్తున్న విద్యార్థినిని కాటేసిన పాము

2235చూసినవారు
టెన్త్ పరీక్ష రాస్తున్న విద్యార్థినిని కాటేసిన పాము
AP: టెన్త్ పరీక్షలు రాస్తున్న విద్యార్థిని పాముకాటుకు గురైన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటు చేసుకుంది. అయితే పాము కాటు వేసిన విషయాన్ని సదరు విద్యార్థిని ఇన్విజిలేటర్‌కు చెప్పింది. ఇన్విజిలేటర్ ఏమీకాదని, భయపడకుండా పరీక్ష రాయాలని సూచించినట్లు తెలిసింది. బసినికొండకు చెందిన అఫ్రన్ శనివారం మదనపల్లెలోని జెడ్పీ హై స్కూల్‌‌లో బయాలజీ పరీక్ష రాస్తుండగా.. పరీక్షా కేంద్రంలో పాము ప్రవేశించింది. ఈ క్రమంలో పాము అఫ్రన్ కాలు మీద కాటేసింది. ఆమెకు వైద్యులు చికిత్స అందించారు.

సంబంధిత పోస్ట్