AP: శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ధి, అధికారిక కార్యక్రమాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్ర బాబుకు ఇకపై ఆ ప్రాంతంలో ప్రత్యేక ప్రోటోకాల్ వర్తించనుంది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎమ్మెల్సీలకు తమకు నచ్చిన నియోజకవర్గాన్ని ఎంచుకునే వెసులుబాటుతో నాగేంద్ర బాబు ఎచ్చెర్లను ఎంపిక చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం.