ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా బెట్టింగ్లకు దూరంగా ఉండాలని లింగసముద్రం ఎస్సై రాంబాబు యువతను హెచ్చరించారు. బెట్టింగ్ వ్యసనం వల్ల అనేకమంది యువకులు మోసపోయి ఆర్థికంగా నష్టపోతున్నారని, అక్రమాలకు దూరంగా ఉండి భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు. బెట్టింగ్లలో పాల్గొన్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.