మంగళవారం వలేటివారిపాలెం మండలం పోకూరు సమీపంలోని హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి పడిపోవడంతో యువకుడు అనుముల శ్రీనాథ్కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని, గాయపడిన శ్రీనాథ్ను కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కందుకూరు నుంచి కూనిపాలెం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.