దగదర్తి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన గురం సంతోష్ (17) అనే యువకుడు సోమవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో కావలి కాలువలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందాడు. స్థానికులు సహాయక చర్యలు చేపట్టినా అప్పటికే ఆలస్యమైంది. ఈ ఘటనతో మృతుడి తండ్రి వరకుమార్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.