నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15న సందర్శించనున్నారు. ఈ హార్బర్ మత్స్యకారుల ఆస్తి అని, భూములను సాగర్ డిఫెన్స్ సంస్థకు అప్పగించే నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ అంశంపై వైసీపీ పోరాటాన్ని మరింత వేగవంతం చేయనుంది.