కోవూరు మండలంలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక అంగడికి వెళ్లి వస్తుండగా ఇద్దరు యువకులు ఆమెను అడ్డుకుని అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఈ సంఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.