రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ నెల 16న నెల్లూరులో 'రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి–సంక్షేమం' పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాట్లను
టీడీపీ నెల్లూరు పార్లమెంటరీ అధ్యక్షుడు బీదా రవిచంద్ర, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జాయింట్ కలెక్టర్, అధికారులు కలిసి పరిశీలించారు. నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్లో జరగనున్న ఈ సభ విజయవంతం కావడానికి అవసరమైన ఏర్పాట్లపై వారు సూచనలు చేశారు.