నెల్లూరు నగర పాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఓ. దినేష్ బుధవారం కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శానిటేషన్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశంలో శానిటేషన్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న దోమల నివారణ చర్యల గురించి అలాగే ప్రతిరోజు నగరంలో జరుగుతున్న ఫాగింగ్, స్ప్రేయింగ్ కార్యక్రమాలు ఖచ్చితముగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.