నెల్లూరు రూరల్ పరిధిలోని దేవరపాలెం జొన్నవాడ బ్రిడ్జి వద్ద ఐఎంఎల్ డిపో ప్రాంతానికి చెందిన కోటయ్య (20), విశాల్ అలియాస్ నారాయణ (21) గల్లంతయ్యారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఆ ప్రాంతానికి చేరుకొని అధికార యంత్రాంగానికి పలు సూచనలు ఇచ్చారు. విశాల్ మృతదేహాన్ని ఈతగాళ్లు ఇప్పటికే వెలికితీశారు. కోటయ్య మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.