జీఎస్టీ 2. 0 తో ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని టిడిపి నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు జీఎస్టీ 2. 0 సంస్కరణల వలన కలిగే ప్రయోజనాలపై గత ఐదు రోజుల నుంచి నెల్లూరు నగర ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కేతంరెడ్డి వినోద్ రెడ్డి శనివారం నవాబుపేట ప్రాంతంలో పర్యటించారు. టిడిపి నాయకులు వై. కోటేశ్వరరావు, హరిబాబు , జాన్ డేవిడ్, జనసేన నాయకులు గుడి హరి కుమార్ రెడ్డి, ముడూరి కనకేశ్వర రావు, అంచల సారథి, కే. లక్ష్మి పాల్గొన్నారు.