నెల్లూరు జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ శాఖ జేడీ సత్యవాణి ఆదివారం తెలిపారు. నెల్లూరు నగరంలోని డిఆర్ ఉత్తమ్ మీడియా హోటల్లో ది న్యూ ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బండారు మాల్యాద్రి నాయుడు జిల్లా అధ్యక్షులుగా, పోకూరి మాల్యాద్రి కార్యదర్శిగా, కుడుముల సంతోష్ రెడ్డి కోశాధికారిగా, ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.