నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, స్థానిక 53వ డివిజన్ లోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం జరిగిన ఫైనల్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టభద్రులైన విద్యార్థులకు ఆమె సర్టిఫికెట్లను బహుకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల కార్యక్రమంలో మేయర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.