నెల్లూరు బారాషాహిద్ దర్గా వద్ద రొట్టెల పండగ మూడో రోజు ఆదివారం కావడంతో భారీగా జన సందడి నెలకొంది. స్వర్ణాల చెరువు వద్ద ప్రజలు ఉద్యోగం, సంతానం, వివాహం వంటి కోరికలు నెరవేరాలని రొట్టెలు మార్చుకోవడానికి ఎగబడ్డారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది.