తిరుపతి కృషి పరిశోధనా కేంద్రం అదనపు పరిశోధనా సంచాలకులు డాక్టర్ గోవిందరాజులు, రైతులు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పొదలకూరులోని వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో బుధవారం ఉద్యాన రైతులకు నిమ్మ, మామిడి పంటలపై అవగాహన కల్పించేందుకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పంట సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోవిందరాజులు, పరిశోధనా సహాయకుడు డాక్టర్ శివరూప కుమార్ తదితరులు పాల్గొన్నారు.