మనుబోలు మండలం వీరంపల్లి హైస్కూల్లో సోషల్ ఉపాధ్యాయురాలు సుసర్ల ప్రభావతి పదవీ విరమణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె విద్యా సేవలను పలువురు కొనియాడారు.
కార్యక్రమంలో హై స్కూల్ ఉపాధ్యాయులు సోమ పద్మరత్నం, టీచర్ ప్రభావతి సేవలను ప్రశంసిస్తూ ప్రత్యేకంగా రచించిన కవితను సభలో చదివి వినిపించి, అనంతరం ఆ కవితను ఆమెకు జ్ఞాపికగా బహుకరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీకాంతారావు, ఉపాధ్యాయులు, విద్యార్థి–విద్యార్థినులు, గ్రామస్తులు పాల్గొని సుసర్ల ప్రభావతి కి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు.