TP గూడూరు మండలం పేడూరు కొలిదిబ్బ గిరిజన కాలనీలో శుక్రవారం రాచగిరి జ్ఞానమ్మకు చెందిన పూరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైంది. ఈ ఘటనలో ఇంటితో పాటు రూ. 45 వేల నగదు, బంగారు కమ్మలు, వంట సామగ్రి కాలిపోయాయి. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీఎం నాయకులు, బాధితురాలికి ప్రభుత్వం పక్కా ఇల్లు నిర్మించి ఆర్థిక సాయం అందించాలని కోరారు. సీపీఎం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.