
కొండాపురం: వర్షాల కారణంగా నీట మునిగిన పంటలు
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండాపురం మండలంలో కంది, మేత జొన్న పంటలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, తూర్పు పాలెం ఎస్సీ కాలనీని వర్షపు నీరు చుట్టుముట్టడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పుష్కలంగా కురుస్తున్నా, కొన్ని రకాల పంటలు వేసిన రైతులు మాత్రం వర్షాల తీవ్రత వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.






































