అమరావతిని శాశ్వత రాజధానిగా ఆమోదించిన సందర్భంగా ముస్లిం మైనారిటీ నేతలు సీఎం చంద్రబాబు, షరీఫ్, ఎమ్మెల్యే ఇంటూరి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదం సమయంలో షరీఫ్ చాకచక్యాన్ని గుర్తుచేసుకున్నారు. అమరావతి రైతుల త్యాగాలను గౌరవిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.