తిరుపతి నుంచి పూరి వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలులో ఆదివారం మధ్యాహ్నం 2:20 గంటలకు బిట్రగుంట రైల్వే స్టేషన్కు చేరుకున్నప్పుడు B1 కంపార్ట్మెంట్లో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు సుమారు గంటన్నర పాటు స్టేషన్లోనే నిలిచిపోయింది. రైల్వే అధికారులు అప్రమత్తమై జాగ్రత్త చర్యలు చేపట్టారు.