వరికుంటపాడు మండలంలోని రామపురం గ్రామ సచివాలయంలో నూతన ఆధార్ సెంటర్ను ఎంపీడీవో రమణారెడ్డి ప్రారంభించారు. మండలంలో ఆధార్ సెంటర్ లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ కేంద్రం ఏర్పాటు చేయబడింది. గ్రామీణ ప్రజలు ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో సూచించారు.