సీతారామపురం మండలం, గుండుపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త రాచాల కొండలరావు అకాల మరణంపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్పందించారు. ఈ విషయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా, ప్రభుత్వం రూ.5 లక్షల ప్రమాద బీమాను మంజూరు చేసింది. మండల కన్వీనర్ చింతల శ్రీను ఈ చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.