అనంతపురంలోని శ్రీ 7 కన్వెన్షన్ హాల్లో
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ హాజరయ్యారు.
జనసేన పార్టీ సింగనమల మండలాధ్యక్షుడు తోట ఓబులేసు, అజయ్ కుమార్ ని కలిసి సింగనమల నియోజకవర్గంలో పార్టీకి చేసిన సేవలు, కార్యక్రమాల గురించి వివరించారు.