కణేకల్లు మండలం జక్కలవడికి చెందిన రజనీకాంత్ అనే యువకుడు విద్యుత్ మరమ్మత్తు పనులకు వెళ్ళినప్పుడు విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎల్సీ తీసుకున్నప్పటికీ విద్యుత్ సరఫరా కావడంతో ప్రమాదం జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. బాధితుడిని బళ్లారి విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.