ధర్మవరం పట్టణంలో బుధవారం తెల్లవారుజామున IDFC బ్యాంకు ఏటీఎం మిషన్ ను దుండగులు అపహరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి, స్థానిక పోలీసుల నుండి దొంగతనం జరిగిన తీరు, పాల్గొన్న వ్యక్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.