
హిందూపురం వైసీపీ ఇన్ఛార్జికి పోలీసుల నోటీసులు
హిందూపురం వైసీపీ ఇన్ఛార్జి దీపిక ఇంటికి అర్ధరాత్రి పోలీసులు వెళ్లారు. తిరుమల లడ్డూ విషయమై ఆమె నేడు నిర్వహించనున్న ప్రెస్మీట్పై నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వచ్చినప్పుడు, ప్రెస్మీట్ వివరాలు నిన్న సాయంత్రమే ప్రకటించినట్లు దీపిక పేర్కొన్నారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని పోలీసులను ఆమె హెచ్చరించారు. అనంతరం వేణు రెడ్డికి నోటీసులు అందజేసి పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు.






































