శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలు తమ ఇళ్లలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా అమర్చుకోవాలని జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ సూచించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (LHMS) యాప్లో ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఇళ్లకు తాళాలు వేసి పెళ్లిళ్లు, దేవాలయాలకు వెళ్లే సమయాల్లో ఈ సాంకేతికత దొంగతనాలను అరికట్టడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు.