శుక్రవారం రాత్రి లేపాక్షి మండలం పి.సడ్లపల్లి- పులమతి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనదారుడు ఇసుక ట్రాక్టర్ను ఢీకొన్న ఘటనలో సునీల్ (22) అనే బేల్దారి అక్కడికక్కడే మృతి చెందాడు. జూమాకులపల్లికి చెందిన సునీల్ హిందూపురం వైపు వెళ్తుండగా, పులమతి వైపు అతివేగంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంపై SI నరేంద్ర ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.