శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లమాడ మండలం చిల్లగోర్లపల్లి గ్రామంలో శివరామిరెడ్డి అనే యువకుడు కుటుంబ కలహాల కారణంగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతన్ని గమనించి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి.