
కళ్యాణదుర్గం: ముదిగల్లులో కరెంటోళ్ల జనబాట
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లులో విద్యుత్ శాఖ అధికారులు మంగళవారం 'కరెంటోళ్ల జనబాట' కార్యక్రమం నిర్వహించారు. డీఈ రాజశేఖర్, ఏఈ జయకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది గ్రామంలో పర్యటించి, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, కాలం చెల్లిన వైర్లను పరిశీలించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.








































