పెదకోడిపల్లిలో మంగళవారం స్నేహితుల మధ్య వివాహేతర సంబంధం విషయమై తలెత్తిన గొడవలో లింగమయ్య(28) అనే వ్యక్తిని మనోజ్ కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. సంఘటనా స్థలంలోనే లింగమయ్య మృతి చెందాడు. అనంతరం నిందితుడు మనోజ్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.