నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా వేడుకలు నిర్వహించుకోవాలని సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ యువతకు సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే వాహనం సీజ్ చేస్తామని, రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందుగా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.