అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలంలోని నాగిశెట్టిపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం రాత్రి ఘోర చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఆలయంలోకి చొరబడి స్వామివారి వెండి కవచం, వెండి పాదాలు, మరియు బంగారు కన్నును అపహరించారు. ఆదివారం ఉదయం ఆలయ కమిటీ సభ్యులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.