
ఎచ్చెర్ల: బడివానిపేట సముద్ర తీరంలో పర్యటించిన ఎమ్మెల్యే
ఎచ్చెర్ల నియోజకవర్గం, బడివానిపేట సముద్ర తీరంలో ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు, ఎంపీ కలిసేట్టి అప్పలనాయుడు మంగళవారం పర్యటించారు. తుఫాన్ ప్రభావం గురించి స్థానిక మత్స్యకారులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు, ఈ నెల 30వ తేదీ వరకు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించారు. అధికారులు కూడా వారితో పాటు పాల్గొన్నారు.







































