ఆదివారం నరసన్నపేటలోని ఒక కల్యాణ మండపంలో గన్నర్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, సైనిక దళంలో గన్నర్స్ విభాగానికి ప్రత్యేక గౌరవం ఉందని, 400 మందికి పైగా దేశ రక్షణలో పాల్గొన్న గన్నర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని భరతమాతకు జేజేలు పలికారని తెలిపారు. గన్నర్స్ దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా వారి సేవలను గుర్తించి గౌరవించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.