సారవకోట: ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గామాత

722చూసినవారు
సారవకోట మండలం అవలంగి గ్రామంలోని శ్రీ నీలమణి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు భాస్కరరావు ఆచారి తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఉత్సవాలు వచ్చే నెల 2వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆదివారం జరిగిన పూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్