ఆమదాలవలస మండలం వెదుళ్లవలసలో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. కూర్మాపు వరలక్ష్మి (30) తన ఇద్దరు కుమార్తెలు భవాని (3), చాందిని (4 నెలలు) గొంతు కోసి, అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ కలహాల కారణంగా క్షణికావేశంలో ఈ ఘోరం జరిగినట్లు స్థానికులు తెలిపారు. వరలక్ష్మిని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. ఆమె భర్త కూలి పనుల నిమిత్తం నల్గొండలో ఉంటున్నాడు.