ఆముదాలవలస నియోజకవర్గ
వైసీపీ ఇన్చార్జి చింతాడ రవికుమార్ సోమవారం జిల్లా కేంద్రంలో జాయింట్ కలెక్టర్ (జేసీ)ను కలిసి పలు సమస్యలపై ఫిర్యాదు చేశారు. బూర్జ మండలంలో భూ సమస్య, పొందూరు మండలంలో తొలగించిన వృద్ధాప్య, వికలాంగ పెన్షన్లు, బాబాజీ మఠంలో అక్రమ లేఔట్ల సమస్యలపై ఫిర్యాదు చేసినట్లు రవికుమార్ తెలిపారు. ఈ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆయన జేసీని కోరారు.