గ్రామాలలో ఏదైనా సంఘటన జరిగితే నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదని, ఆపద సంభవిస్తే సెల్ఫోన్లో 112 నెంబర్కు కాల్ చేస్తే వెంటనే పోలీస్ అధికారులు అందుబాటులోకి వస్తారని శక్తి టీం హెచ్ సి తమ్మినేని అమ్మాజీ తెలిపారు. బుధవారం పొందూరు మండలం పిల్లల వలసలో మహిళలకు అవగాహన కల్పించారు. సెల్ఫోన్లో ఎస్ ఓ ఎస్ ను వినియోగిస్తే తక్షణమే స్పందిస్తారని ఆమె పేర్కొన్నారు.