పొందూరు మండలం గార పేటలోని ఆనందాశ్రమంలో శనివారం ఏకాదశి పర్వదినం సందర్భంగా సప్త హరి భజన కార్యక్రమాన్ని ఆశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద ప్రారంభించారు. 24 గంటల పాటు వివిధ భజన మండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా ఆలయాలను సందర్శించాలని భక్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.