సరుబుజ్జిలిలోని పలు ఆదివాసీ గ్రామాలలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. సోమవారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, ఉద్యోగాల సంగతి ఎలా ఉన్నా ఈ ప్లాంట్ వస్తే తమ ప్రాంతం నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రవికుమార్ తమ గ్రామానికి రావాలంటే ప్లాంట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.