ఎచ్చెర్ల మండలం కేశవరావు పేట గ్రామానికి సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఒక హిజ్రా హత్యకు గురయ్యారు. బుధవారం ఉదయం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై లక్ష్మణరావు, తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.