ఆమదాలవలస మండలం పురుషోత్తపురం గ్రామం వద్ద ఇసుక రాంప్ లో ఇసుక లోడ్ చేయడానికి వెళ్లిన లారీలు, జేసీబీలు నది మధ్యలో వరద నీటిలో చిక్కుకున్నాయి. ఒక్కసారిగా నీరు పెరగడంతో డ్రైవర్లు వాహనాలను వదిలి ఒడ్డుకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు.