శనివారం రాత్రి సోంపేట మండలం పాలవలస గ్రామంలో భజన మండలి కళాకారుల ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది. దీపావళి నుంచి కార్తీక మాసం చివరి రోజు వరకు ప్రతిరోజూ గ్రామంలో హరేరామ సంకీర్తన (పొందర భజన) నిర్వహిస్తామని కళాకారులు తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.