Jan 29, 2026, 15:01 IST/మానకొండూర్
మానకొండూర్
రసమయి బాలకిషన్ దేవక్కపల్లి అమ్మవార్లను దర్శించి బంగారం సమర్పణ
Jan 29, 2026, 15:01 IST
గురువారం బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి గ్రామంలో అమ్మవార్లను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ దేవతలను దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.